ఇనుపరాడ్లతో కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు: తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు

తూర్పుగోదావరి: జిల్లాలోని కాట్రేనికోన మండలంలోని చెయ్యేరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు ఇనుపరాడ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇనుపరాడ్లతో దాడి చేసుకోవడంతో కార్యకర్తలు తీవ్ర గాయాలయ్యాయి. అంగన్వాడీ ఆయా పోస్టు కోసం తలెత్తిన వివాదంలో భాగంగానే టీడీపీలో ఈ రెండు వర్గాలు ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x4l7Zv

0 comments:

Post a Comment